పోటీ పరీక్షలు రాసిన సమయంలో ఒక మార్కుతో, అర మార్క్ తో జాబ్ రాకపోతే ఆ బాధ అంతాఇంతా కాదు.తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన కబులాసాబ్( Kabulasab ) బీఎడ్ పూర్తి చేసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నారు.
ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయిన కబూలా సాబ్ లక్ష్యంపై దృష్టి పెట్టి సక్సెస్ దిశగా అడుగులు వేశారు.కష్టపడితే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందనే నమ్మకంతో ముందుకెళ్లారు.
తన సక్సెస్ స్టోరీ గురించి కబులాసాబ్ చెబుతూ 2012 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష ( DSC Exam ) రాసినా నేను క్వాలిఫై కాలేదని 2017 సంవత్సరంలో డీఎస్సీ, గురుకుల పరీక్షలు రాశానని తెలిపారు.కరోనా తర్వాత తెలుగు భాషను ఎంచుకున్నానని 2021 సంవత్సరంలో తెలుగులో సెట్, 2023 లో నెట్ లో క్వాలిఫై అయ్యానని కబూలాసాబ్ వెల్లడించడం గమనార్హం.2023 సంవత్సరం ఆగష్టు నెలలో టీజీటీ నోటిఫికేషన్ ( TGT Notification )వచ్చిందని కబూలాసాబ్ పేర్కొన్నారు.
ఈ ఉద్యోగం కోసం నేను ఏడాది పాటు చదివానని కబూలాసాబ్ కామెంట్లు చేయడం గమనార్హం.ఇతరుల సలహాలతో ముందుకెళ్తూ 12 పద్ధతిలో టీజీటీ జాబ్ తో పాటు జేఎల్ క్వాలిపై అయ్యానని కబూలాసాబ్ వెల్లడించారు.పీజీటీ పరీక్షలో ( PGT exam )నేను ఒక్క మార్క్ తో డిస్ క్వాలిఫై అయ్యానని ఆయన తెలిపారు.
ఆ సమయంలో నేను కొంత నిరుత్సాహానికి గురయ్యానని కబూలాసాబ్ వెల్లడించారు.
జేఎల్ డెమోలో( JL demo ) నేను మంచి ప్రతిభను కనబరిచానని తాజాగా రిలీజైన టీజీటీ రిజల్ట్స్ లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించానని కబూలాసాబ్ పేర్కొన్నారు.కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని కబూలా సాబ్ వెల్లడించారు.కష్టపడితే సక్సెస్ సాగుతుందని నా సక్సెస్ తో ప్రూవ్ అయిందని ఆయన అన్నారు.
కబులా సాబ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.