తెలంగాణలో హైదరాబాద్ లో ఈడీ అధికారులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.దీనిలో భాగంగా బంజారాహిల్స్ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
బ్యాంకు రుణాల ఎగవేతపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ.75 కోట్ల రుణం, ఐఎన్జీ వైశ్యా బ్యాంకు నుంచి రూ.55.80 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు నోట్ల రద్దు సమయంలో బోగస్ విక్రయాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంది.