శ్రీకాకుళం కలెక్టర్ గేటు వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలకు విద్య, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు మద్ధతు తెలిపారు.అదేవిధంగా ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
దీనిపై విచారణ జరిపి వర్సిటీ వైస్ ఛాన్సలర్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అయితే వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు కంప్యూటర్ కొనుగోళ్లలో రూ.రెండు కోట్లకు పైగా అవకతవకలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు.అనంతరం ప్రజాసంఘాల నేతలు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.