దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అధికారులు విచారిస్తున్నారు.
దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.గుజరాత్ ఎన్నికలు ఫలితాలు వెలువడే వరకూ సిసోడియాను జైల్లో ఉంచుతారన్నారు.
డిసెంబర్ 8 వరకు సిసోడియా జైల్లోనే ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా కావాలనే కుట్ర పూరితంగా ఈడీ పేరిట అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.