పుంగనూరు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు ప్రయత్నించారని ఆరోపిస్తూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరహరి, చినబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.అయితే పుంగనూరు ఘటనలో ఐదు ఎఫ్ఐఆర్ లతో పాటు సుమారు రెండు వందలమందిపై కేసులు నమోదు చేశారు.
దాంతో పాటు 60 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.మరోవైపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హజరు పర్చలేదంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే.