ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దని సూచించారు.
అభ్యర్థిని, పార్టీని చూసి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.పేదలకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో ఆలోచించాలన్నారు.
దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారన్న కేసీఆర్ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.అలాగే సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్ సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కూడా కాంగ్రెస్సేనని మండిపడ్డారు.రైతుల సంక్షేమాన్ని సైతం కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు.24 గంటల కరెంట్, రైతుబంధు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని తెలిపారు.కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యమేనని ఎద్దేవా చేశారు.