ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Hearing On Mlc Kavitha's Petition Tomorrow In The Supreme Court-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు.అదేవిధంగా మద్యం కుంభకోణంలో తన నివాసంలో గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తనను విచారణ చేయాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.

తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.కాగా ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మసనం రేపు విచారణ జరపనుంది.

మరోవైపు ఎమ్మెల్సీ కవితను వీడి అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube