ఏపీ సీఎం జగన్ పై దాడి నిందితుడికి 14 రోజుల రిమాండ్..!!

ఏప్రిల్ 13వ తారీకు విజయవాడ సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగటం తెలిసిందే.ఈ ఘటనలో నిందితుడిని ఈనెల 17వ తారీకు పోలీసులు పట్టుకోవడం జరిగింది.

 Fourteen Days Remand For Accused Of Attack On Ap Cm Jagan Details, Ap Cm Jagan-TeluguStop.com

వేముల సతీష్( Vemula Satish ) అనే వ్యక్తి.జగన్ మీద దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

దీంతో ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ ని.విజయవాడ పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

పోలీసులు పేర్కొన్న పుట్టిన తేదీ వివరాలకు అతని… ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాదు నిందితుడికి నేరచరిత్ర కూడా లేదని పేర్కొన్నారు.

రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారని వాదనలు వినిపించారు.ఈ క్రమంలో పోలీసుల తరపు న్యాయవాది స్పందిస్తూ… నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయి దాడి( Stone Attack ) చేయటం జరిగిందని ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితులలో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న విజయవాడ కోర్ట్( Vijayawada Court ) సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది.

దీంతో నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube