ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
ఇటీవలే భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి బాలసానిని పార్టీ అధిష్టానం తప్పించిందని తెలుస్తోంది.దీంతో పార్టీ తీరుపై బాలసాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలసాని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.