చికెన్.ఈ పేరు వింటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరుతుంటుంది.మనలో కూడా చాలా మంది చికెన్ను అమితంగా ఇష్టపడుతుంటారు.చికెన్తో రకరకాల వంటలను తయారు చేసుకుని లాగించేస్తుంటారు.పరిమితంగా తీసుకుంటే చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
సీజనల్ వ్యాధులు దరి చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది.
ఇలా ఎన్నో లాభాలు అందిస్తుంది.కానీ, చికెన్తో పాటుగా కొన్ని కొన్ని ఆహారాలను పొరపాటున కూడా తీసుకోరాదు.
ఆ ఆహారాలు ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్, పెరుగు.
ఈ రెండిటిని కలిపి లేదా ఒకేసారి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.అయితే ఇకపై మాత్రం అలా అస్సలు చేయవద్దు.
చికెన్, పెరుగు ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.దాని వల్ల అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.
అలాగే కొందరు చికెన్, చేపలు ఒకేసారి తింటుంటారు.అయితే ఈ రెండిటిలోనూ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.అందువల్ల, ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి.ఫలితంగా తలనొప్పి, కడుపు తిమ్మిరి, మలబద్ధకం వంటివి ఇబ్బంది పెడతాయి.
చికెన్ తిన్న వెంటనే పండ్లను లేదా పండ్లను తిన్న వెంటనే చికెన్ను పొరపాటున కూడా తీసుకోరాదు.ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే వాంతులు, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, చికాకు వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ఇక చికెన్, బంగాళదుంపలను కూడా ఒకేసారి తీసుకోరాదు.ఈ రెండిటిది వరస్ట్ ఫుడ్ కాంబినేషన్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చికెన్, బంగాళదుంపలను కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.