ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.వారి ఎదురుచూపులకు తెర దించుతూ భారత్ లో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం అయింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన స్టోర్ ను ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు.డోర్స్ ఓపెన్ చేసి కస్టమర్లకు ఆయనే స్వయంగా స్వాగతం పలికారు.
కాగా ఈ ఈవెంట్ లో ఐఫోన్ ప్రేమికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రెండో రిటైల్ స్టోర్ దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 20వ తేదీన ప్రారంభంకానుంది.అమెరికా, చైనా, బ్రిటన్, సింగపూర్ తరువాత భారత్ లో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యాయి.2016లో తొలిసారి టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు.దాదాపు ఏడు సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు టిమ్ కుక్ యాపిల్ స్టోర్ ప్రారంభం కోసం వచ్చారు.2020లో భారత్ లో ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించిన సంస్థ మూడేళ్ల వ్యవధి తర్వాత తమ స్టోర్ ను ఓపెన్ చేసింది.