తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో ఓబీసీ వెల్ ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ ( KCR ) అడిగారని తెలిపారు.
ఈ క్రమంలోనే సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దని సూచించారు.అలాగే దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ( Judicial Commission )వేయాలన్నారు.దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేశారు.