మాదక ద్రవ్యాల కేసులో ఎంతమంది టాలీవుడ్ స్టార్స్ కు క్లీన్ చిట్ వచ్చిందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియా ఎంతో మంది సెలబ్రిటీల మెడకు ఉచ్చు బిగుసుకుంది.ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ నేరారోపణలను ఎదుర్కొన్నారు.

 Do You Know How Many Tollywood Stars Got Clean Chit In Drugs Case, Tollywood, He-TeluguStop.com

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి బయటకు వచ్చినప్పటికీ డ్రగ్స్ కేసులో భాగంగా విచారణను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ డ్రగ్ మాఫియా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలువురు సెలబ్రెటీల మెడకు చుట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈడీ అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేసి వారిని తరచూ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మి రకుల్ ప్రీత్ సింగ్ రవితేజ రానా వంటి వారిని ఈడీ అధికారులు పెద్ద ఎత్తున విచారణ చేశారు.

ఇప్పటివరకు వీరందరినీ తరచూ విచారణకు పిలిచి ఈడీ అధికారుల నుంచి కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో భాగంగా ఈ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది.

Telugu Clean Chit, Drugs, Heroes, Tollywood-Movie

ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వగా తాజాగా ఈడీ అధికారులు కూడా ఈ కేసులో వీరికి క్లిన్ చిట్ ఇచ్చింది.ఇటీవల టాలీవుడు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసిన సంగతి మనకు తెలిసిందే.కేవలం డ్రగ్ కేసులో మాత్రమే కాకుండా మనీలాండరింగ్ విషయంలో కూడా అధికారులు వీరిని పెద్దఎత్తున విచారణ చేపట్టారు.అనూహ్య పరిణామాల మధ్య విచారణ ప్రారంభించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం కావడంతో ఈ కేసును మూసివేసింది.

ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ అధికారులు సైతం ఈ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రగ్ మాఫియా కేసులో భాగంగా ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ సెలబ్రిటీలకు ప్రస్తుతం ఉపశమనం లభించిందని చెప్పవచ్చు.

ఇక ఈడీ అధికారుల నుంచి క్లీన్ చిట్ లభించిన ఈ సెలబ్రిటీలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలాంటి సమయంలో వారు తరచూ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలన్న ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగింది.

ఈడీ అధికారుల నుంచి క్లీన్ చిట్ లభించడంతో ఉపశమనం పొందిన వారిలో తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, మిగిలిన హీరో హీరోయిన్లు, పూరి జగన్నాథ్ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా బిజీ గా ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారుల నుంచి వీరికి ఇలాంటి ఉపశమనం లభించడంతో ఈ సెలబ్రిటీలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube