పంజాబ్ కేబినెట్ మంత్రికి కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజురోజుకు కరోనా కేసులు వేలల్లో నమోదవుతూనే ఉన్నాయి.

 Panjab, Minister, Corona Positive-TeluguStop.com

ఇప్పటివరకు దేశంలో 30 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులను కరోనా వెంటాడుతోంది.ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కొందరు క్యూర్ అయి విధులు కూడా నిర్వర్తిస్తున్నారు.

అయితే తాజాగా పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధావాకు కరోనా పాజిటివ్ వచ్చిందని పంజాబ్ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తన ట్వీటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.‘‘ నా కేబినెట్ సహచరుడు, రాష్ట్ర జైలు శాఖ మంత్రి సుఖ్జిందర్ రాంధావాకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు.

పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆయన త్వరగా కోలుకుని అందరితో కలిసి పని చేయాలని కోరుతున్నాను.’’ అంటూ ట్వీటర్ లో వెల్లడించారు.ఇప్పటి వరకు పంజాబ్ క్యాబినెట్ మంత్రుల్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.

మంత్రులు రాజిందర్ సింగ్ బజ్వా, గురు ప్రీత్ సింగ్ కాంగర్ లు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube