మెగాస్టార్ చిరంజీవి కరెక్ట్ మార్కెట్ ఎంత అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు.చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలలో నటించిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.
అయితే చిరంజీవి అసలు సత్తా తెలియాలంటే మాత్రం భోళా శంకర్ సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతోంది.షాడో సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.
ఈ సినిమా రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ రిజల్ట్ విషయంలో ఒకింత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.మరోవైపు చిరంజీవికి మెహర్ రమేష్ బంధువు కావడం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కిందని కొంతమంది భావిస్తారు.
భోళా శంకర్ లో కీర్తి సురేష్, తమన్నా కూడా నటిస్తుండటంతో ఈ సినిమాకు స్టార్ అట్రాక్షన్ ఎక్కువగానే ఉందనే కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తుండటం గమనార్హం.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సక్సెస్ లతో జోరుమీదున్న చిరంజీవి మరింత హుషారుగా ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు.కోల్ కతాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
వేదాళం సినిమాకు రీమేక్ గా సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాలో చాలా మార్పులు జరిగాయి.చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.మార్కెట్ పెరగడంతో చిరంజీవి పారితోషికాన్ని అమాంతం పెంచేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారనే సంగతి తెలిసిందే.