సాధారణంగా కొందరు పిల్లలు తరచూ అలసిపోతుంటారు.ఆ ఆలసట కారణంగా ఆటల్లో, చదువుల్లో చురుగ్గా పాల్గొనలేకపోతుంటారు.
దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది.అయితే పిల్లలకు సరైన పోషకాలు అందక పోవడం వల్లే మాటి మాటికి వారు అలసటకు గురవుతుంటారు.
అలాంటి పిల్లలకు ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ను తప్పని సరిగా ఇవ్వాల్సి ఉంటుంది.తద్వారా వారిలో అలసట దూరమై యాక్టివ్గా, ఎనర్జిటిక్గా మారతారు.
మరి పిల్లల డైట్లో చేర్చాల్సిన ఆ ఫుడ్స్ ఏంటో లేట్ చేయకుండా కిందకు ఓ లుక్కేసేయండి.
నెయ్యి.
రుచిలోనే కాదు పోషకాలు మెండుగానే ఉంటాయి.పిల్లలకు ప్రతి రోజు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని ఏదో ఒక రూపంలో ఇవ్వాలి.
తద్వారా నెయ్యిలో ఉండే పోషక విలువలు వారిలో అలసటను తగ్గించడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు సైతం దరి దాపుల్లోకి వెల్లకుండా అడ్డు కట్ట వేస్తాయి.
చేపల కూడా పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వారంలో కనీసం ఒకసారైనా పిల్లల చేత చేపలను తినిపిస్తే.వారి శరీరం శక్తి వంతంగా ఉండటానికి కావాల్సిన బోలెడన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
పిల్లలు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలంటే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలను వారికి అందేలా చూసుకోవాలి.అందు కోసం పాలు, బాదం పప్పు, వాల్ నట్స్, అవకాడో పండు, కివీ పండు, అరటి పండు, పాల కూర, గుడ్డు, కమలా పండ్లు, క్యారెట్, చిలకడ దుంపలు, బెర్రీ పండ్లు, సన్ ఫ్లెవర్ సీడ్స్ వంటి ఫుడ్స్ను పిల్లల డైట్లో ఉండేలా చూసుకోవాలి.
ఇక గ్లాస్ పాలల్లో రెండు ఖర్జూరాలను నాన బెట్టి.పిల్లల చేత తాగించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక పిల్లలు తరచూ అలసి పోకుండా ఉంటారు.మరియు వారిలో రక్త హీనత సమస్య ఏర్పడకుండా ఉంటుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మెదడు పని తీరు సైతం మెరుగు పడుతుంది.