నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన బాలయ్య, రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించాడు.
అయితే తొలి షెడ్యూల్ ముగిసే సరికే లాక్డౌన్ రూపంలో ఈ సినిమాకు పెద్ద అడ్డంకి వచ్చింది.కాగా ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ చేయని పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం.
అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమాలో బాలయ్య కవల పాత్రల్లో నటిస్తున్నాడని, అందులో ఒకటి విలన్ పాత్రగా ఉంటుందని, హీరో-విలన్ మధ్య సాగే సస్పెన్స్ డ్రామాకు ప్రేక్షకులు మెస్మరైజ్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.హీరో, విలన్ పాత్రల మధ్య నడిచే ట్రాక్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక బోయపాటి ఈసారి బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్టును రాసినట్లు, తెలుగు సినిమాల్లో ఈ మధ్య చూడని కథ ఈ సినిమాలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.కాగా బాలయ్య ఈ సినిమాలో అఘోరా గెటప్లో మనకు కనిపిస్తాడని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి బాలయ్య సింహా, లెజెండ్ సినిమాల తరహా సక్సెస్ను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.