స్కూల్ ఆవరణలో గ్రామ సచివాలయాల నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో ప్రజా సొమ్ముతో నిర్మించినందుకు భవనాలను ఆ స్కూళ్లకే అప్పగిస్తామని కోర్టు తెలిపింది.
స్కూళ్ల అవసరాలకే వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.ప్రజావేదికను ప్రజల సొమ్ముతోనే కట్టారు కదా అన్న హైకోర్టు అప్పుడొక వైఖరి, ఇప్పుడొక వైఖరి అయితే ఎలా అని ప్రశ్నించింది.
నిర్మాణాలను ఆపాలని చెప్పినా కొనసాగించడం అక్రమమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.