ఈ మధ్య కొందరు ప్రేమికులు పబ్లిక్ ప్లేసుల్లో రెచ్చిపోతున్నారు.చుట్టుపక్కల ఎవరు ఉన్నారంటూ ఆలోచించకుండా బరితెగించడం మొదలుపెట్టారు.
దీనికి ఉదాహరణగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనకు తెలిసినవే.మెట్రోలో ప్రయాణం చేస్తున్న సమయంలో చుట్టూ జనం ఉన్న కానీ కొందరు యువతీ యువకులు ముద్దు పెట్టుకుంటూ కనిపించే ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం( Delhi Metro ) సైతం అలాంటి వారిపై చర్యలు చేపట్టింది.
దాంతో ఆ వీడియో చాలా వైరల్ గా మారింది.ఇకపోతే ఢిల్లీ లాగా బెంగళూరు మెట్రో కూడా అలాగే అవుతుందేమో అనేలా కనబడుతుంది.
ఈ విషయ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
తాజాగా బెంగళూరు మెట్రోలో( Bangalore Metro ) జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.బెంగళూరు మెట్రోలో ఓ యువ జంట ముద్దులు పెట్టుకుంటూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెట్రో ప్రయాణం చేస్తున్న సమయంలో యువతీ యువకుడు( young woman ,young man ) ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారని, ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని సహ ప్రయాణికుడు రికార్డు చేయగా అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరు పోలీసులకు అతడు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో అతని పోస్టులో భాగంగా అసలు మన బెంగళూరు మెట్రోలో ఏం జరుగుతుంది.? మెల్లమెల్లగా బెంగుళూరు మెట్రో ఢిల్లీ మెట్రో గా మారిపోతోందా అంటూ వారిపై చర్యలు చేపట్టినట్టు పోస్ట్ చేశాడు.ఒక అమ్మాయి అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుంది అంటూ క్లిప్పు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు ఈ వీడియో సంబంధించి కూడా స్పందిస్తూ.గమనించాము దయచేసి మీ నెంబర్ ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా అందించండి అంటూ రిప్లై వచ్చింది.
ఇక ఈ వీడియో సంబంధించి సోషల్ మీడియాని నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొందరైతే ఇలాంటి వాళ్లను అసలు క్షమించవద్దు అని అంటుండగా మరికొందరు.వాళ్ళిద్దరూ అంత పెద్ద తప్పేమీ చేయలేదంటూ కామెంట్ చేస్తున్నారు.