బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని యువ హీరో అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా విడుదలపై చిత్ర బృందం ఎప్పుడూ స్పందించలేదు.
అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా.అంటూ అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారాన్ని చిత్రబృందం అధికారికంగా విడుదల చేశారు.అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్టోబర్ 8వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటివరకు అఖిల్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఎంతో నిరాశ చెందిన అభిమానులు ఈ సినిమా ద్వారా అఖిల్ సక్సెస్ ని అందుకుంటాడా లేదో అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా గత కొద్దికాలం నుంచి ఏ విధమైనటువంటి హిట్ లేకపోవడంతో ఈ సినిమా అతనికి కూడా ఎంతో కీలకంగా మారింది.ఈ సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.సినిమాలో అఖిల్ పూజా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తప్పకుండా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే అఖిల్ తన తర్వాత ప్రాజెక్టు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.