రైల్వే బడ్జెట్ కి వేళయ్యింది.బడ్జెట్ లో కొన్ని ప్రధాన విషయాల మీద మనకి వివరాలు అందుతూ ఉన్నాయి.
కొత్త రైల్వే బడ్జెట్ లో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టే పనిలో ఉందట ఇండియన్ రైల్వే.ఈ సారి రైల్వే బడ్జెట్ లో రాబోతున్న ఈ వింత ఆఫర్ ఏంటంటే .రైల్వే ప్రయాణంలో ప్రయాణికులు.తాను ప్రయాణం చేస్తున్న మార్గమధ్యంలోని ఏదైనా హోటల్ భోజనం కావాలన్న విషయాన్ని ముందస్తుగా తెలియజేసే అవకాశాన్ని కల్పించటంతో పాటు.
సదరు హోటల్ భోజనం ప్రయాణికుడికి అందే కొత్త విధానాన్ని రైల్వే మంత్రి ప్రకటించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.రిజర్వ్ టిక్కెట్ల మీద ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ప్రయాణీకుడు నచ్చిన హోటల్ నుంచి భోజనం తీసుకునే ఏర్పాటు ఐఆర్సీటీసీ తీసుకుంటుంది.వారు అంతర్గత సామర్ధాన్ని ఎక్కువగా వాడుకుని ఆ సేవల ద్వారా ఆ హోటల్ నుంచి ప్రయాణీకుడికి భోజనం తెప్పిస్తారు.