టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత తాజాగా కోలీవుడ్లో కూడా వరుస విజయాలతో దూసుకు పోతుంది.తమిళనాట జెండా పాతాలని కోరుకున్న ఈ అమ్మడి కోరిక నెరవేరింది.
ప్రస్తుతం తమిళంలో ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
యమ బిజీ అయిన ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసింది.ఇంతకు ముందు వరకు కోటి రూపాయలు తీసుకునే సమంత తమిళంలో క్రేజ్ రావడంతో రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొన్ని రోజుల ముందు ఈమెకు అజిత్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.అయితే ఆ సినిమాలో నటించేందుకు సమంత రెండు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసింది.
తమిళనాట ఏ హీరోయిన్ కూడా అంత డిమాండ్ చేయదు.ఈమె డిమాండ్కు నిర్మాత షాక్ అయ్యాడు.
అంత పారితోషికం ఇవ్వలేను అంటూ తేల్చి చెప్పాడు.అయినా కూడా సమంత తన పారితోషికాన్ని తగ్గించుకునేది లేదని చెబుతోంది.
తెలుగులో కూడా ఈమె చరణ్ సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేయడం వల్లే తప్పించారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.చరణ్ సినిమాకు మొదట సమంతను అనుకుని ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.