ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణకు తీవ్ర అస్వస్థత చేసింది.పశ్చిమ గోదావరి జిల్లాకు సంక్రాంతి సంబరాల కోసం వెళ్లిన ఎమ్మెస్కు అక్కడ ఫుడ్ పడక పోవడంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలుస్తోంది.
ఎమ్మెస్ నారాయణను వెంటనే భీమవరం హాస్పిటల్కు తరలించారట.అక్కడ ప్రధమ చికిత్స అనంతరం వెంటనే విజయవాడ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించారు.
విజయవాడలో పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన పిమ్మట, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకు వచ్చి, కిమ్స్లో మరోసారి ఆరోగ్య పరీక్షలు జరిపించారు.ప్రస్తుతం ఎమ్మెస్ నారాయణ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడని కిమ్స్ డాక్టర్లు తేల్చి చెప్పారు.
అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా కొంత నీరసంగా ఉన్నాడని, కొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.పలు సినిమాల్లో నటిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.