టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల( Naga Chaitanya ) ల గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగాయి.
వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలన్నీ కూడా అవాస్తవాలుగానే మిగిలిపోయాయి.
కానీ తాజాగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అన్న వార్త హల్చల్ చేస్తోంది.
![Telugu Married, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-Movie Telugu Married, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/naga-chaitanya-sobhita-dhulipala-married-nagarjuna-getting-married-Social-media-Thandel-Movie.jpg)
దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నాగచైతన్య శోభిత ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరుగునుందని, అంతేకాకుండా వీరి వివాహానికి ఇరు కుటుంబాలు నేడు ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే వార్త ప్రస్తుతం కూడా కూస్తోంది.
దీనిపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.మరోవైపు ఈ వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ వార్తలో నిజా నిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
![Telugu Married, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-Movie Telugu Married, Naga Chaitanya, Nagarjuna, Thandel, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/married-naga-chaitanya-sobhita-dhulipala-married-getting-married-Social-media-Thandel-Movie.jpg)
మరి ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ లేదా నాగచైతన్య శోభిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇది నిజంగానే షాకింగ్ వార్త అని చెప్పాలి.ఇకపోతే శోభిత విషయానికి వస్తే.శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు.2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు.ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.ఇకపోతే నాగ చైతన్య విషయానికొస్తే…నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా( Thandel Movie )లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.