అనంతపురం జిల్లా( Anantapur ) కల్యాణదుర్గం మండలంలో చిరుత సంచారం కలకలం చెలరేగింది.తాజాగా చాపిరి గ్రామం( Chaparai )లో సంచరించిన చిరుత ఆవుదూడపై దాడి చేసింది.
చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.