ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో హైదరాబాద్ కు రానున్నారు.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించనున్నారు.
తాడేపల్లి కార్యాలయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్ కు రానున్నారు.కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నారు.
అయితే గత నెలలో ఫామ్ హౌస్ లో జారిపడటంతో కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వారం రోజుల పాటు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ప్రత్యేకంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు రానున్నారు.అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.