తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో( Assembly Elections ) గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇంక నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రజలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్( KCR ) పార్టీ భావిస్తోంది.ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సీనియర్ నాయకులు జూపల్లి కృష్ణారావు( Jupalli Krishna Rao ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన చాలా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
సోనియా వల్లే( Sonia Gandhi ) ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం జరిగిందని పేర్కొన్నారు.గతంలో సోనియా ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవి వద్దనుకుని మన్మోహన్ సింగ్ ను( Manmohan Singh ) ప్రధానిగా చేసిన నిస్వార్థపరురాలు అంటూ జూపల్లి వ్యాఖ్యానించారు.కల్వకుంట్ల కుటుంబానికి సోనియా కుటుంబానికి అసలు పోలిక లేదని తెలిపారు.అంతేకాకుండా బీఆర్ఎస్.( BRS ) బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని పేర్కొన్నారు.కాబట్టి జరగబోయే ఎన్నికలలో ప్రజలంతా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని స్పష్టం చేశారు.
పొరపాటున బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.