కేసిఆర్ ఎన్నో హామీలు నెరవేర్చలేదు అంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో( Assembly Elections ) గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇంక నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రజలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

 Former Minister Jupalli Krishna Rao Serious Comments On Kcr Details, Brs, Kcr,-TeluguStop.com

మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్( KCR ) పార్టీ భావిస్తోంది.ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సీనియర్ నాయకులు జూపల్లి కృష్ణారావు( Jupalli Krishna Rao ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన చాలా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

సోనియా వల్లే( Sonia Gandhi ) ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం జరిగిందని పేర్కొన్నారు.గతంలో సోనియా ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవి వద్దనుకుని మన్మోహన్ సింగ్ ను( Manmohan Singh ) ప్రధానిగా చేసిన నిస్వార్థపరురాలు అంటూ జూపల్లి వ్యాఖ్యానించారు.కల్వకుంట్ల కుటుంబానికి సోనియా కుటుంబానికి అసలు పోలిక లేదని తెలిపారు.అంతేకాకుండా బీఆర్ఎస్.( BRS ) బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని పేర్కొన్నారు.కాబట్టి జరగబోయే ఎన్నికలలో ప్రజలంతా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని స్పష్టం చేశారు.

పొరపాటున బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube