నేటి నుంచి కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించాయి.ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

 Acceptance Of Applications From Congress Aspirants From Today-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరించనుంది.మధ్యాహ్నం ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

కాగా ఇప్పటికే అభ్యర్థుల దరఖాస్తు రుసుమును టీపీసీసీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఓసీ, బీసీలకు దరఖాస్తు రుసుము రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube