మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
సాయంత్రం 4 గంటలకు అవినాశ్ రెడ్డిని విచారించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అవినాశ్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.అటు అవినాశ్ రెడ్డి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ పేర్కొంది.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.