శోభన్ బాబు అందాల నటుడిగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంతో పాటు ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు.అభిమానులు శోభన్ బాబును సోగ్గాడు అని ప్రేమగా పిలుచుకుంటారు.
ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది శోభన్ బాబును అభిమానిస్తారు.శోభన్ బాబు భౌతికంగా దూరమైనా ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.
రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు సంపాదించిన డబ్బును భూములపై పెట్టుబడులు పెట్టారు.
కెరీర్ తొలినాళ్లలో 750 రూపాయలు, 1500 రూపాయల రెమ్యునరేషన్ శోభన్ బాబు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.
తక్కువ సంఖ్యలో పౌరాణిక సినిమాలలో నటించినా ఆ సినిమాలు శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.కుటుంబ కథా చిత్రాలతో శోభన్ బాబు మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
శోభన్ బాబుకు నట భూషణ, ఆంధ్రా అందగాడు అనే బిరుదులు ఉన్నాయి.
మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, ధర్మపీఠం దద్దరిల్లింది సినిమాలు ఒక సినిమాలు మించి మరొకటి సక్సెస్ సాధించి శోభన్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.శోభన్ బాబు నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంటున్నారు.శోభన్ బాబు నటించిన 26 సినిమాలు 100 కంటే ఎక్కువ రోజులు ఆడాయి.
సీనియర్ నటి గీతాంజలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ అప్పట్లో ఎలా ఉండేదంటే మన నిర్ణయాలపై కెరీర్ ఆధారపడి ఉండేదని గీతాంజలి అన్నారు.పద్మనాభంకు జోడీగా నటించడంతో ఆ తరహా పాత్రలే ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపారు.సినిమాలో శోభన్ బాబును దద్దోజనం అని తిట్టగా ఆ తిట్టు ఇప్పటికీ పాపులర్ అయిందని గీతాంజలి పేర్కొన్నారు.
నా జీవితానికి దారి చూపించిన మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ అని గీతాంజలి కామెంట్లు చేశారు.