న్యూజిలాండ్ పై ఇటీవల వరుస వన్డే మ్యాచ్ లు గెలిచి సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా మొదటి టి20 మ్యాచ్ ఓడిపోయింది.రాంచిలో జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ కి దిగిన కివీస్ 177 పరుగులు చేయడం జరిగింది.ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన అర్ష్ దీప్ ఏకంగా 27 పరుగులు ఇవ్వడం జరిగింది.
ఒక నోబాల్, 3 సిక్సులు.ఒక ఫోర్ మిగతా.
డబల్ రన్స్ చేసి చితక్కొట్టారు.దీంతో కివీస్ భారీ స్కోరు చేయడం జరిగింది.
ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇండియా టీంలో సూర్య కుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా (21), వాషింగ్టన్ సుందర్ (50) పరుగులు మాత్రమే చేయగా మిగతా బ్యాట్స్ మ్యాన్ లు… అందరూ విఫలమయ్యారు.సుందర్ క్రిజ్ లో నిలబడినా గాని మరో వ్యక్తి సహకారం లేకపోవడంతో… టీమిండియా ఓటమిపాలైంది.ఈ విజయంతో న్యూజిలాండ్ 3 t20 మ్యాచ్ ల సిరీస్ లలో 1-0తో ముందంజలో ఉంది.
నెక్స్ట్ మ్యాచ్ జనవరి 29వ తారీకు లక్నోలో జరగనుంది.