రాజు ఎక్కడున్నా రాజే.. వయనాడ్‌ బాధితులకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్..

టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన డార్లింగ్ హీరో ప్రభాస్( Darling hero Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హీరో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

 Prabhas Gave A Huge Donation To The Victims Of Raje Wayanad, Update News, Waynaa-TeluguStop.com

ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందాడు.డార్లింగ్ హీరో ప్రభాస్ తాజాగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో( Wayanad ) జరిగిన వరద బీభత్సం కారణంగా.

ఈ ప్రమాదంలో 400 మంది పైగా మరణించారు.వందల మంది గల్లంతయ్యారు.

ఈ నేపథ్యంలో వారందరినీ ఆదుకునేందుకు చాలామంది ప్రముఖులు ముఖ్యంగా సినీ తారలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుండి అల్లు అర్జున్, చిరంజీవి కుటుంబ సభ్యులు విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా ఈ లిస్టులో డార్లింగ్ ప్రభాస్ చేరాడు.

ఇదివరకు వరద బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా.చిరంజీవి – రామ్ చరణ్ కలిపి కోటి రూపాయలను భక్తులకు విరాళంగా ప్రకటించారు.ఇక తాజాగా గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ఏకంగా రెండు కోట్ల( Two crores ) రూపాయల్ని కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించారు.

దీంతో హీరో ప్రభాస్ ను కేవలం రియల్ హీరో మాత్రమే కాదు.రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కేవలం టాలీవుడ్ తారల మాత్రమే కాకుండా.దక్షిణాది సినీ పరిశ్రమల నుండి హీరో హీరోయిన్లు సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార, ఫాజిల్ లు భారీ విరాళాన్ని ప్రకటించారు.ఈ నేపథ్యంలో మరికొంతమంది వరద బాధితులకు సహాయం చేయడానికి అతి త్వరలో ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube