మెదక్ జిల్లా చేగుంట మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.చిన్నశివునూరు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
బ్లాస్టింగ్ ధాటికి ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు సజీవ దహనమైయ్యారు.కాగా మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా చిధ్రమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది.పేలుడు శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సర్పంచ్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.