బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు అలాగే వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమను చూపిస్తారు.
ఎవరైనా మూగజీవాలను హింసించినట్టు ఆమె దృష్టికి వెళితే తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా తన గలం వినిపిస్తారు.ఇలా మూగజీవాలను హింసించిన ఎంతోమంది పట్ల ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా తమిళ నటుడు సంతానంపై కూడా రష్మీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అసలు తమిళ నటుడు పై రష్మి ఫైర్ అవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నటుడు సంతానం ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో భాగంగా ఈయన మత్తులో ఉన్న ఒక పెద్ద పులి దగ్గర కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చాడు.
అలాగే దాని తోక పట్టుకున్న వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టైగర్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఇతని వ్యవహారం పై మండిపడ్డారు.ఇక ఈ వీడియో కాస్త రష్మి కంటపడింది.ఈ వీడియోలో మత్తులో ఉన్న ఆ పులి నీరసంగా పడుకుంది.పులి పడుకుందా అని సంతానం ప్రశ్నించడంతో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ స్టిక్ తో షాక్ ఇచ్చి దానిని లేపాడు.
దీంతో రష్మీ ఈ వీడియో పై మండిపడుతూ సరదా కోసం ఏజంతువు నైనా హింసించడం తప్పు డ్రగ్స్ ఇచ్చిన జంతువు పక్కన కూర్చొని ఇలా ఆ ప్రదేశాన్ని ప్రమోట్ చేస్తున్నారని గ్రహించాలి.ఇలా ఒక జంతువుదాని జీవన విధానానికి దూరం చేయడం కరెక్ట్ అయిన పని కాదు అంటూ రష్మి తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఈ వీడియో పై స్పందించారు.
ప్రస్తుతం రష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.