ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగించారని ప్రచారమవుతున్న వార్తలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.
ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సజ్జల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.