ఢిల్లీలో వెలుగులోకి అమానుష ఘటన..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రేమించిన అమ్మాయిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఓ యువకుడు.

 Inhumane Incident Came To Light In Delhi..-TeluguStop.com

ప్రియురాలి మృతదేహాన్ని మొత్తం 35 ముక్కలుగా చేసిన అఫ్తాబ్ పూనావాలా అనే కిరాతకుడు.అనంతరం ఆ ముక్కలను ఢిల్లీ సమీప అడవుల్లో పడేసినట్లుగా గుర్తించారు.

అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో పెళ్లి చేసుకోమని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు.

మే నెలలో హత్యకు పాల్పడిన అఫ్తాబ్ శ్రద్ధ మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో ఉంచాడని పోలీసులు విచారణలో తెలిపారు.అర్ధరాత్రి సమయాల్లో ముక్కలను అడవుల్లో పడేసేవాడని పేర్కొన్నారు.

సుమారు 18 రోజులపాటు ఈ విధంగానే చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.నెలల తరబడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో శ్రద్ధ తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.

దాంతో ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube