టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.సిట్ ఏర్పాటుతో పాటు పోలీస్ కస్టడీని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు అయింది.
ఈ మేరకు హైకోర్టులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిల్ ను వేశారు.సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణను జరిపించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
అయితే, తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.