ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ నిలిపివేయాలని పిటిషన్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

సిట్ ఏర్పాటుతో పాటు పోలీస్ కస్టడీని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు అయింది.ఈ మేరకు హైకోర్టులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిల్ ను వేశారు.

సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణను జరిపించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

అయితే, తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

మీడియం రేంజ్ హీరోల్లో స్టార్ హీరోగా మారే అవకాశం ఉన్న హీరో ఈయనేనా..?