యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని ఈసారి కూడా అంతే స్థాయిలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన ఇమేజ్ ను ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ లైనప్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.
మరి నెక్స్ట్ లైనప్ లో ముందుగా ఉంది కొరటాల శివ.ఈయనతో సినిమా ఎప్పుడో ప్రకటించారు.అయితే ఈ సినిమా ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఫ్యాన్స్ అంతా అసలు ఈ సినిమా ఉందో లేదో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇటీవలే ఒక పిక్ రిలీజ్ చేసి ఈ అనుమానాలను పటాపంచలు చేసేసారు.
డైరెక్టర్ కొరటాల, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇంకా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్న పిక్ ఒకటి నిర్మాణ సంస్థ షేర్ చేయడంతో ఫ్యాన్స్ లో ఆందోళన తగ్గింది.
ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 టీమ్ మొత్తం ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వెతకడంలో బిజీగా ఉన్నారట.
లొకేషన్స్ కూడా సర్చ్ చేసి పెట్టుకుని పక్కాగా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సాబు సిరిల్, రత్నవేలు ఇద్దరు కలిసి గోవాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం జల్లెడ పడుతున్నారట.కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే వీరు లొకేషన్స్ వేటలో బిజీ.
మొత్తానికి అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.
ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.