మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమలులో ఉండనుందని పేర్కొంది.
మునుగోడు ప్రచారం, ర్యాలీ, సభల్లో పాల్గొనరాదని ఆంక్షల్లో పేర్కొంది.టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని అన్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బీజేపీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.