టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ పరిచయమే.ఇక ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.
2010లో సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా అడుగుపెట్టిన పూజా.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయం.
నిజానికి దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.ఇక అలా వైకుంఠపురంలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది.
అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.ఓ వైపు బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు బాగా అందుకుంటుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.
తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.
ఇక మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు కనిపించడం కాస్త కష్టంగా మారింది.
ఇక ఇదంతా పక్కన పెడితే.ఈ ముద్దుగుమ్మ కు ఇటీవలే కాళ్లకు గాయం అయింది.
దీంతో సినిమాలకు దూరంగా ఉండగా.తాజాగా తను కాలు విరగొట్టుకున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటోని షేర్ చేస్తూ.కాళ్లు విరిగింది.ఓకే అని అన్నది.ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో తన అభిమానులు తన కాళ్లకు గాయం కావడంతో చాలా బాధగా ఫీల్ అవుతున్నారు.
ఇక మరికొందరు ఐరన్ లెగ్గు కు ఏమైంది అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉంది.