విశాఖలో హైడ్రామా కొనసాగుతోంది.ఎయిర్ పోర్టు ఘటన కేసులో అరెస్ట్ అయిన జనసేన నాయకులు విడుదల అయ్యారు.
అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట జనసేన కార్యకర్తలను పోలీసులు హాజరుపరిచారు.మొత్తం 92 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
వీరిలో 72 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 9 మందికి విశాఖ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి.
మిగిలిన 61 మందికి బెయిల్ మంజూరు చేశారు.రూ.10 వేలు పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.అయితే తమను పోలీసులు హింసించారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.