వాణిజ్య సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.దీంతో వినియోగదారులకు కొంచెం ఊరట లభించింది.19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.91.50 మేర తగ్గింది.ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి.దీంతో ఢిల్లీలోవాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,976 నుంచి రూ.1,885 కు దిగొచ్చింది.
గత జులైలోనూ సిలిండర్ ధర 8.5 శాతం మేర తగ్గగా.ఆగస్ట్ 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.36 తగ్గింది.ఇక ఇళ్లల్లో వినియోగించే ఎల్పీజీ సీలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలే కొనసాగుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా కస్టమర్లకు 15 రోజులకు ఒకటే సబ్సిడీ సిలిండర్ అంటూ బీపీసీఎల్ పరిమితి విధించింది.