టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తన నటనతో యావత్ ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.
రానా ఏ సినిమాలో నటించిన ఆ పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాకూండా ఈయనకు ఇమేజ్ పెరుగుతుంది.దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమాతో రానా వరల్డ్ వైడ్ గా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పుడు రానా నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.
వేణు ఉడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా రిలీజ్ చేయకుండా ఆపారు.నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూసారు.
వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో రానాకు జోడీగా సాయి పల్లవి నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దీంతో టీమ్ అంతా సంతోషంగా ఉన్నారు.అయితే అప్పుడే ఈ సినిమా ఓటిటి డీలింగ్ కూడా క్లోజ్ అయ్యింది.ఈ సినిమాను నెట్ ప్లిక్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేశారట.ఈ సినిమాను 15 కోట్ల రూపాయలు పెట్టి మరీ నెట్ ప్లిక్స్ వారు డీల్ క్లోజ్ చేసినట్టు సమాచారం అందుతుంది.
ఇదే నిజం అయితే ఈ సినిమాకు ఇంత ధర ప్లస్ అయ్యే అవకాశం ఉంది.ఇంకా సాటిలైట్ రైట్స్ తో కూడా భారీ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలా విరాటపర్వం సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంది.ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది.