సినిమా థియేటర్లు మరియు టికెట్ ధరలు గురించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్ లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.ఒక్కసారిగా సినిమా టికెట్ ధరలు ఏపీ ప్రభుత్వం తగ్గించడంతో… సినీ నిర్మాతలు మరియు హీరోలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
దీంతో సినిమా టికెట్ల ధరలు గురించి వైసీపీ మంత్రులతో ఇండస్ట్రీకి చెందిన రామ్ గోపాల్ వర్మ.కొంత మంది టాప్ నిర్మాతలు పలుమార్లు చర్చలు జరిపారు.
కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇదే విషయంపై చిరంజీవినే స్వయంగా తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి.
ఓన్ టూ ఒన్ చర్చలు జరిపారు.అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మళ్లీ కలుస్తున్నట్లు చాలా సానుకూలంగా సీఎం జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 వ తారీకు అనగా రేపు గురువారం సీఎం జగన్ తో చిరంజీవి భేటీ ఖరారయింది.
అయితే ఈ భేటీలో చిరంజీవి తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు కూడా హాజరవుతున్నారు అట.వాళ్ళు మరెవరో కాదు ప్రభాస్, మహేష్, నాగార్జున, మరికొంత మంది హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, రాజమౌళి.ఇంకా పెద్ద నిర్మాతలు కూడా హాజరు కానున్నారు.
త్వరలో పెద్ద సినిమాలు వరుస పెట్టి విడుదలవుతున్న క్రమంలో… సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల బేటీ ఇండస్ట్రీ పరంగా రాజకీయపరంగా సంచలనంగా మారింది.