చిలకలూరిపేట: గెలుపోటములు సహజమని.క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు.
సెమీక్రిస్మస్ వేడుకలలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్దు తూర్పు మాలపల్లి యూత్ ఆధ్వర్యంలో మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో బుధవారం రాత్రి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే విడదల రజిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు.
యువత చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు.
అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.
ఉత్సాహ పూరిత వాతావరణంలో వాలీబాల్ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.