తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అగ్గి రాజేస్తున్నాయి.ముఖ్యంగా బీజేపీ ని టార్గెట్ చేసుకుని కేసీఆర్ చేస్తున్న విమర్శలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
ఈ క్రమంలో తన ఫామ్ హౌస్ పై.సెటైర్లు వేసిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై.కేసిఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సంస్కారం కలిగిన రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన విధానమెనా ఇది.అంటూ బండి సంజయ్ పై మండిపడ్డారు.నేను మందు తాగుతా అని మాట్లాడుతున్న, నువ్వు నాకు ఏమైనా కలిపావా.
అంటూ సెటైర్లు వేశారు.
నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిని వ్యవసాయం చేస్తాను నాకు ఫాంహౌస్ ఉంటుంది.
నీకు మాదిరిగా గెస్ట్ హౌస్ ఉండవు.నాది ఫాంహౌస్ కాదు ఫార్మర్ హౌస్.
వ్యవసాయ క్షేత్రం అది.మీడియా ప్రతినిధులు కూడా నా ఫామ్ హౌస్ కి రావడం జరిగింది.అక్కడ కూరగాయలు పండిస్తాను.మాకు కంపెనీ లేవు, దొంగ బిజినెస్ లేవు.ధంధాలు లేవు.దొంగ వ్యాపారాలు లేవు.
చిన్ననాటి నుండి వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళం.నా ఫామ్ హౌస్ కి వచ్చి దున్నుట.
అనే అంటున్నావు నేను ఏమైనా దొంగ పని చేశానా.?.నా కొడకా నా ఫామ్ హౌస్ లో అడుగుపెడితే ఆరు మొక్కలు అవుతావు.అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసిఆర్ కౌంటర్ ఇచ్చారు.