అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరక్షన్ లో వస్తున్న సినిమా మేజర్.26/11 ముంబై ఎటాక్ లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా వస్తుంది.ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.2022 ఫిబ్రవరి 11న మేజర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈ విషయాన్ని మేజర్ నిర్మాతల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ ఎనౌన్స్ చేశారు.మేజర్ షూటింగ్ కు సంబందించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
120 రోజుల షూటింగ్.8 సెట్లు.75 లొకేషన్స్ లో మేజర్ సినిమా షూటింగ్ చేశారు.ఇక ఈ సినిమాను తెలుగు, మళయాళం హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
అడివి శేష్ తో పాటుగా ఈ సినిమాలో సయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల కూడా నటించారు.మేజర్ గా అడివి శేష్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.
అంతకుముందు వచ్చిన మేజర్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.యువ హీరోల్లో సెపరేట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు అడివి శేష్.
ఖచ్చితంగా ఈ సినిమాతో కూడా అతను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడని చెప్పొచ్చు.