పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అనే చెప్పాలి.ఎందుకంటే పెండ్లి అయిన తర్వాతనే ప్రతి ఒక్కరి జీవితం మలుపు తిరుగుతుంది.
కానీ అప్పుడప్పుడు ఈ పెండ్లి ఇంట్లో కూడా కొన్ని విషాదాలు నెలకొంటున్నాయి.మంటపాల దగ్గర కూడా పెండ్లిలు ఆగిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
ఇంక కొందరు అయితే పెండ్లి అయిన తర్వాత వెంటనే విడిపోతున్నవారు కూడా ఉన్నారు.అయితే ఇప్పుడు కూడా ఇలాగే పెండ్లి సందర్భంగా జరిగిన ఘటన సంచలనం రేపుతోంది.
వివరాలేంటో తెలుసుకుందాం.
ఆ అమ్మాయికి పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చడంతో సంతోషంగా పెండ్లి చేసుకుంది.
ఇంకేముంది అంతా బాగానే వుంది అనుకుని ఆ పెండ్లి కూతురు మురిసిపోయింది.కానీ ఇంతలోనే ఆమెకు పిడుగులాంటి వార్త తెలిసింది.
అదేంటంటే తన భర్తకు అసలు రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయని, ఇక జీవితంలో బాగవవ్డం కుదరదని చెప్పారు.దీంతో ఆమె తీవ్రంగా కుంగిపోయింది.
ఇక తాను మాత్రం వెరవకుండా తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తోంది.కానీ ఇంతలోనే విధి ఆమెపై కాటు వేసింది.
తన భర్తకు మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతడి కాలు, చేయి పూర్తిగా పాడైపోయి స్పర్శ లేకుండా చచ్చుబడిపోయాయని తెలిసింది.అయినా కూడా ఆమె తన భర్తను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉంది.కానీ ఇవన్నీ చూసి భరించలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె జీవితం అగమ్య గోచరంగా తయారైంది.ఇక్కడ అసలు విషయం ఏంటంటే పెళ్లికి ముందే ఆ వ్యక్తికి కిడ్నీల సమస్యలు ఉన్నా కూడా అత్తమామలు పెండ్లి కూతురుకి చెప్పలేదంట.ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లలోని ధనలక్ష్మిపురంలో చోటుచేసుకుంది.
కానీ విధి ఆడిన నాటకంలో ఆ పెండ్లి కూతురు జీవితం దారుణంగా తయారైంది.