దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే నేడు కరోనా ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసే రీతిలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ టీటీడీ కీలక నిర్ణయాలు జారీ చేయడం జరిగింది.
ఏమాత్రం కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం మరి ఏ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా గాని వెంటనే తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ దేవస్థానం కోరింది.శ్రీవారి దర్శనానికి వచ్చేవారు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఈ నెల 21 నుంచి 30 వ తారీఖు వరకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్లు కొన్నా భక్తులు కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఆలస్యమైందని రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతులు ఇస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.